Road Accident: రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. 24మంది మృతి!
Road Accident: అతివేగం ప్రాణాంతకం అని తెలిసికూడా.. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఎంతోమంది నిండుప్రాణాల్ని బలి తీసుకుంది. రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడి 24 మంది దుర్మరణం చెందారు. బూండీలోని కోట లాల్సాత్ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో కోట నుంచి సవాయ్మాధోపూర్ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ […]
Road Accident: అతివేగం ప్రాణాంతకం అని తెలిసికూడా.. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఎంతోమంది నిండుప్రాణాల్ని బలి తీసుకుంది. రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడి 24 మంది దుర్మరణం చెందారు. బూండీలోని కోట లాల్సాత్ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో కోట నుంచి సవాయ్మాధోపూర్ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ నదిలో బోల్తాపడింది.
కాగా.. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు. ఇప్పటివరకు కనీసం 24 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.