కరోనాతో ఆర్ఎంపీ వైద్యుడు మృతి..ఊళ్లోకి రానివ్వని గ్రామస్తులు
మొన్న పెద్దపల్లి జిల్లాలో డాక్టర్ శ్రీరామ్ చూపిన ఔదార్యానికి యావత్ తెలంగాణ హర్షించింది. కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో డాక్టర్ శ్రీరామ్ స్వయంగా ట్రాక్టర్ నడిపించి మృతదేహన్ని తరలించి దగ్గరుండి దహన సంస్కరాలు నిర్వహించారు. కానీ,..
మొన్న పెద్దపల్లి జిల్లాలో డాక్టర్ శ్రీరామ్ చూపిన ఔదార్యానికి యావత్ తెలంగాణ హర్షించింది. కరోనాతో మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో డాక్టర్ శ్రీరామ్ స్వయంగా ట్రాక్టర్ నడిపించి మృతదేహన్ని తరలించి దగ్గరుండి దహన సంస్కరాలు నిర్వహించారు. కానీ, సంగారెడ్డి జిల్లాలో మాత్రం కోవిడ్తో చనిపోయిన ఆర్ఎంపీ వైద్యుడికి అంత్యక్రియలు జరిపేందుకు గ్రామస్తులు అడ్డుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని సుల్తానాబాద్కు చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ కరోనా సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృత దేహన్ని స్వగ్రామమైన సుల్తానాబాద్ తరిలించగా.. అక్కడ స్థానికులు అంత్యక్రియలకు సహకరించలేదు. ఆర్ఎంపీ కరోనాతో చనిపోవడంతో గ్రామస్తులు మృతదేహాన్ని ఊళ్లోకి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. కరోనాతో చనిపోయాడు కాబట్టి.. ఊరి శివారులో అంత్యక్రియలు నిర్వహించొద్దన్నారు. దీంతో పోలీసులు, పంచాయతీ అధికారులు మృతదేహానికి నల్లవాగు ప్రాజెక్టు సమీపంలో జేసీబీతో గోతి తవ్వి అంత్యక్రియలు నిర్వహించారు.