సెలబ్రిటీ కపుల్ సాయం..ఎందరికో అయ్యారు ఆదర్శం!
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ తమ మంచి మనుసును చాటుకున్నారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. సోమవారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా జెనీలియా, రితేష్కు ధన్యవాదాలు తెలిపారు. దీనీపై రితేష్ దేశ్ముఖ్ రీ ట్వీట్ చేశారు. ‘వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని […]
బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ తమ మంచి మనుసును చాటుకున్నారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. సోమవారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి చెక్కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా జెనీలియా, రితేష్కు ధన్యవాదాలు తెలిపారు.
దీనీపై రితేష్ దేశ్ముఖ్ రీ ట్వీట్ చేశారు. ‘వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మహారాష్ట్రతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నా మనసును, జెనీలియా మనసును చలింపజేశాయి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రిని కలసి ‘దేశ్ ఫౌండేషన్’ తరఫున విరాళం అందించాం. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నా. మనమంతా కలిస్తే ఎంతో సాధించొచ్చు. థాంక్స్ దేవేంద్ర ఫడ్నవీస్ జీ’ అని ఆయన ట్వీట్లు చేశారు.
Thank you Riteish and Genelia Deshmukh for the contribution of ₹25,00,000/- (₹25 lakh) towards #CMReliefFund for #MaharashtraFloods !
@Riteishd @geneliad pic.twitter.com/Y6iDng2epD
— Devendra Fadnavis (@Dev_Fadnavis) August 12, 2019
Over the past few days the floods have caused havoc in Maharashtra & other parts of the country..the visuals have been distressing and disturbing, @geneliad and myself met our Hon CM this morning and made a humble contribution towards the CM Relief Fund through ‘Desh Foundation’. https://t.co/t8XaFAuT3A
— Riteish Deshmukh (@Riteishd) August 12, 2019