విక్రయానికి ఆర్ ఇన్ఫ్రా కీలక ఆస్తులు
ముంబయి: అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్కు చెందిన ఆర్ ఇన్ఫ్రా కీలకమైన ఆస్తులను విక్రయానికి పెట్టనున్నట్లు ప్రకటించింది. దిల్లీ-ఆగ్రా టోల్ రోడ్వేలో మొత్తం వాటాను సింగపూర్కు చెందిన క్యూబ్ హైవేకు రూ.3,600 కోట్లకు విక్రయించనుంది. దీంతో ఈ కంపెనీ అప్పు 25శాతం తగ్గి రూ.5వేల కోట్ల లోపు ఉంటుంది. ఇప్పటికే రిలయన్స్ ఇన్ఫ్రా క్యూబ్ హైవేస్తో ఒప్పందం కూడా చేసుకొంది. ఈ ఒప్పందం ప్రకారం దిల్లీ-ఆగ్రా టోల్రోడ్లో 100శాతం వాటాను విక్రయించనుంది. ఆర్ ఇన్ప్రా చెందిన డీఏ […]
ముంబయి: అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్కు చెందిన ఆర్ ఇన్ఫ్రా కీలకమైన ఆస్తులను విక్రయానికి పెట్టనున్నట్లు ప్రకటించింది. దిల్లీ-ఆగ్రా టోల్ రోడ్వేలో మొత్తం వాటాను సింగపూర్కు చెందిన క్యూబ్ హైవేకు రూ.3,600 కోట్లకు విక్రయించనుంది. దీంతో ఈ కంపెనీ అప్పు 25శాతం తగ్గి రూ.5వేల కోట్ల లోపు ఉంటుంది. ఇప్పటికే రిలయన్స్ ఇన్ఫ్రా క్యూబ్ హైవేస్తో ఒప్పందం కూడా చేసుకొంది. ఈ ఒప్పందం ప్రకారం దిల్లీ-ఆగ్రా టోల్రోడ్లో 100శాతం వాటాను విక్రయించనుంది. ఆర్ ఇన్ప్రా చెందిన డీఏ టోల్ రోడ్ సంస్థ మొత్తం 180 కిలోమీటర్ల దిల్లీ – ఆగ్రా హైవేను నిర్వహిస్తోంది.