ఎన్నికల బరిలో కుబేరులు..!
కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలు అందరూ కూడా తమ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థులుగా తెలుగు రాష్ట్రాల రెండిట్లోనూ దాదాపు కుబేరులే ఎన్నికల బరిలో నిలబడడం విశేషం. తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థుల లిస్ట్ లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువ 895 కోట్లుగా అఫిడివేట్ […]
కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలు అందరూ కూడా తమ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థులుగా తెలుగు రాష్ట్రాల రెండిట్లోనూ దాదాపు కుబేరులే ఎన్నికల బరిలో నిలబడడం విశేషం. తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థుల లిస్ట్ లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువ 895 కోట్లుగా అఫిడివేట్ లో చూపించారు. ఇక ఏపీలో విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పొట్లూరి వర ప్రసాద్(పీవీపీ) కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.347.75కోట్లుగా ప్రకటించారు. అటు రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు వీరిద్దరే హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇది చూస్తుంటే ఈ ఎన్నికల్లో డబ్బులు ఏరులై పారుతుందని అనిపిస్తోంది.