Breaking : డ్రగ్స్ కేసులో రియాకు బెయిల్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలపై అరెస్టు అయిన దాదాపు నెల రోజుల తర్వాత రియా చక్రవర్తికి బెయిల్ లభించింది.

Breaking : డ్రగ్స్ కేసులో రియాకు బెయిల్
Follow us

|

Updated on: Oct 07, 2020 | 3:57 PM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన ఆరోపణలపై అరెస్టు అయిన దాదాపు నెల రోజుల తర్వాత రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. ప్రత్యేక కోర్టు నిన్న వారి  కస్టడీని అక్టోబర్ 20 వరకు పొడిగించిన నేపథ్యంలో రియా, ఆమె సోదరుడు షోవిక్ బాంబే హైకోర్టును అప్రోచ్ అయ్యారు. అయితే రియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, ఆమె సోదరుడి పిటిషన్‌ మాత్రం తిరస్కరించింది.  పది రోజులపాటు ముంబై పోలీసుల ఎదుట హాజరు కావాలని, ముంబై విడిచి వెళ్లకూడదని కోర్టు రియాకు సూచించింది. జూన్ 14 న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించిన ప్రముఖ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం డ్రగ్స్  లావాదేవీలు జరిపిన ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8 న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Also Read : రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి