Republic Motion Poster: ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతున్న సాయి ధరమ్ తేజ్… సరిదిద్దుకుంటూ సక్రమంగా సాగాలని సలహా…
ప్రజలు ఎన్నుకున్న నాయకులు, శాసనాలు అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు ఒకరి తప్పులు ఒకరు సరిదిద్దుకుంటూ...
ప్రజలు ఎన్నుకున్న నాయకులు, శాసనాలు అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టులు ఒకరి తప్పులు ఒకరు సరిదిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యమని అదే అసలైన రిపబ్లిక్ అని అంటున్నాడు టాలీవుడ్ సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్. ఈ మెగా హీరో దేవాకట్టా డైరెక్షన్ లో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. రాజకీయాలు, ప్రజాస్వామ్యం చుట్టూ తిరిగే కథాంశంతో రిపబ్లిక్ రానున్నట్టు మోషన్ పోస్టర్ ను చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాజేశ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మోషన్ పోస్టర్లో ప్రకటించారు. కాగా కరోనా తర్వాత మొదటి సినిమాగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ సోలో బతుకే సోబెటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.