నగ్నంగా సుశాంత్ మాజీ మేనేజర్ మృతదేహం : ఖండించిన పోలీసులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మేనేజర్ దిశా సలియన్ డెడ్బాడీని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవలే మీడియాలో సర్కులేట్ అయిన వార్తలను ముంబై పోలీసులు ఖండించారు.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ డెడ్బాడీని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవలే మీడియాలో సర్కులేట్ అయిన వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. అవన్నీ ఫేక్ అని డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ తేల్చి చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్లేసుకు చేరుకున్నారని.. ఆమె పేరెంట్స్ సమక్షంలోనే మృతదేహానికి పంచనామా చేసినట్లు తెలిపారు.
జూన్ 8న రాత్రి మలాద్లోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి దిశ సూసైడ్ చేసుకుంది. సరిగ్గా ఐదు రోజుల తర్వాత సుశాంత్ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ రెండు ఘటనలు బాలీవుడ్ సహా రాజకీయంగా కలకలం రేపాయి. రెండు వేర్వేరు ఘటనలను కొంత మంది నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇప్పటికే తమ కుమార్తె మృతిపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దిశ ఫ్యామిలీ స్పష్టం చేసింది. ముంబై పోలీసులు చాలా నిజాయతీగా దర్యాప్తు చేస్తున్నారని.. తమను అపఖ్యాతిపాలు చేయాలని చూడటం బాధ కలిగించిందని వాపోయారు.
Also Read : ట్విట్టర్ మోత మోగిపోయింది : మహేశ్ ఫ్యాన్స్ వరల్డ్ రికార్డ్