హైపవర్ కమిటీ అధ్యయనంలో తేలింది ఇదే

ఏపీ రాజధాని విషయంలో అధ్యయనం చేసిన కమిటీల నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు నియమించిన హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యింది. సుమారు గంట పాటు జరిగిన భేటీలో తాము అధ్యయనం చేసిన అంశాలపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హైపవర్ కమిటీ సభ్యులు. శుక్రవారం సాయంత్రం వరకు రైతుల నుంచి, ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చే అవకాశం వుండడంతో ఇంకా తుది నివేదిక రూపకల్పన చేయలేదని కమిటీ సభ్యులు తెలిపారు. […]

హైపవర్ కమిటీ అధ్యయనంలో తేలింది ఇదే
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 17, 2020 | 9:08 PM

ఏపీ రాజధాని విషయంలో అధ్యయనం చేసిన కమిటీల నివేదికలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు నియమించిన హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యింది. సుమారు గంట పాటు జరిగిన భేటీలో తాము అధ్యయనం చేసిన అంశాలపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హైపవర్ కమిటీ సభ్యులు. శుక్రవారం సాయంత్రం వరకు రైతుల నుంచి, ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చే అవకాశం వుండడంతో ఇంకా తుది నివేదిక రూపకల్పన చేయలేదని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే.. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదికల్లో పేర్కొన్నట్లుగానే సచివాలయ తరలింపునకే హైపవర్ కమిటీ మొగ్గుచూపినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం మరోసారి హైపవర్ కమిటీ ముఖ్యమంత్రితో భేటీ అవుతుందని తెలుస్తోంది.

దాదాపు 15 రోజుల పాటు అధ్యయనం జరిపిన హై పవర్ కమిటీ.. 29 గ్రామాల్లో సేకరించిన 33 వేల ఎకరాల విషయంలో లోతుగా స్టడీ చేసింది. ల్యాండ్ ఫూలింగ్ ద్వారా ప్రభుత్వానికి చేరిన భూముల్లో ఎన్ని ఎకరాలను వినియోగించారు? ఎంత భూమిని ఇంకా టచ్ చేయలేదు? అనే అంశాలను పరిశీలించారు హై పవర్ కమిటీ సభ్యులు. సీఆర్డీఏ రద్దు విషయాన్ని పరిశీలించిన కమిటీ సభ్యులు.. దాని స్థానంలో విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి అభివృద్ధి బోర్డును పునరుద్దరించాలని, దాని ద్వారా సీఆర్డీఏ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే అంశంపైనే ఎక్కువ ఫోకస్ చేసిన కమిటీ.. అందుకోసం తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వానికి సూచించనున్నట్లు సమాచారం. మొత్తానికి శుక్రవారం సాయంత్రం వరకు వచ్చే సూచనలు, వినతులను పరిగణలోకి తీసుకుని, జనవరి 20 ఉదయం జరిగే రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికను అందజేయనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం తర్వాత అదే రోజున ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఈ నివేదికను ప్రవేశపెట్టి… దాని సూచనలకు సభ ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..