తెలంగాణ : ఎంజీఎం ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్..
ఎం.జి.ఎం హాస్పిటల్ నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. అతడిని హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తీసుకొచ్చారు జైలు అధికారులు.
ఎం.జి.ఎం హాస్పిటల్ నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. అతడిని హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో అతడిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తీసుకొచ్చారు జైలు అధికారులు. 14చోరీలు చేసి గత నెలలోనే పట్టుబడ్డాడు ఖైసర్. చోరీల కేసుల్లో ప్రస్తుతం అతడు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు.
వైద్య పరీక్షల నిమిత్తం గురువారం ఉదయం ఖైసర్ ఎంజీఎంకు తీసుకొచ్చారు జైలు సిబ్బంది. కరోనా లక్షణాలు ఉండటంతో అతని వద్ద శాంపిల్స్ సేకరించి..కోవిడ్ వార్డులో చేర్పించారు. అక్కడ ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ తప్పించుకొని పారిపోయాడు కైసర్. దీంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జైలు సిబ్బంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..అతడి కోసం గాలిస్తున్నారు.