బెంగాల్లో తెరుచుకున్న ఆలయాలు
లాక్డౌన్ కారణంగా దేశం మొత్తం మూతపడింది. బడులు, గుడులు ఒకటేమిటీ అంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వటంతో ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు జనం. ఇందులో భాగంగా..కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలను తెరిచేందుకు ఓకే చెప్పింది. బెంగాల్ ప్రభుత్వం కూడా ఇవాళ్టి (జూన్01) నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించింది. అయితే, అతిపురాతన కాళీఘాట్ ఆలయంతోపాటు కాథడ్రల్ చర్చిని తెరిచేందుకు మాత్రం దీదీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా, కోల్కతాలో ప్రసిద్ధమైన కాథడ్రల్ చర్చిని […]
లాక్డౌన్ కారణంగా దేశం మొత్తం మూతపడింది. బడులు, గుడులు ఒకటేమిటీ అంతా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వటంతో ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు జనం. ఇందులో భాగంగా..కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలను తెరిచేందుకు ఓకే చెప్పింది. బెంగాల్ ప్రభుత్వం కూడా ఇవాళ్టి (జూన్01) నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించింది. అయితే, అతిపురాతన కాళీఘాట్ ఆలయంతోపాటు కాథడ్రల్ చర్చిని తెరిచేందుకు మాత్రం దీదీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు.
అదేవిధంగా, కోల్కతాలో ప్రసిద్ధమైన కాథడ్రల్ చర్చిని కూడా ప్రభుత్వం మూసివుంచింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ఈ చర్చిలో ప్రార్థనలకు అనుమతి ఇవ్వటం లేదు. ఇక మసీదులకు మాత్రం ఆంక్షలతో కూడిన అనుమతులను జారీ చేసింది. నమాజు సమయంలో ఐదుగురుకి మించి అనుమతి లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఇండ్లలోనే ప్రార్థనలు చేయాలని బెంగాల్ ఇమాం అసోసియేషన్ ముస్లింలకు సూచించింది.