సరికొత్త చరిత్ర సృష్టించిన రిలయన్స్
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకుపోతోంది. ఆ సంస్థ షేర్ వాల్యూ ఇవాళ అమాంతం పెరిగిపోయింది. 200 బిలియన్ మార్కును దాటింది. బీఎస్ఈలో నిన్నటి ముగింపు..
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకుపోతోంది. ఆ సంస్థ షేర్ వాల్యూ ఇవాళ అమాంతం పెరిగిపోయింది. 200 బిలియన్ మార్కును దాటింది. బీఎస్ఈలో నిన్నటి ముగింపు రూ. 2,161తో పోలిస్తే… ప్రస్తుతం రిలయన్స్ షేర్ మరో రూ. 151 పెరిగి రికార్డు స్థాయిలో రూ. 2,313 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో ఆ సంస్థ మార్కెట్ క్యాపిటల్ రూ. 14,67,670.76 కోట్లకు పెరిగింది. రీటైల్ బిజినెస్ లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోందని నిన్న రిలయన్స్ ప్రకటించిన నేపథ్యంలో ఈ భారీ పెరుగుదల నమోదు చేసుకున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 534 పాయింట్లు పెరిగి 38,727 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి 11,417 వద్ద కొనసాగుతోంది. రిలయన్స్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ తదితర కంపెనీల షేర్లు ముందంజలో ఉన్నాయి.