‘చిత్రలహరి’ విడుదలపై క్లారిటీ
సాయి ధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విడుదలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదల అవ్వబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా […]
సాయి ధరమ్ తేజ్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విడుదలపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు. ఏప్రిల్ 12న ఈ చిత్రం విడుదల అవ్వబోతున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
కాగా ‘సుప్రీం’ తరువాత వరుస ఫ్లాప్ల్లో పడ్డ సాయి ధరమ్ ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కోసం కాస్త బొద్దుగా మారిన ధరమ్.. కొత్త లుక్లో కనిపించనున్నాడు. మరోవైపు ‘నేను శైలజ’ విజయం తరువాత ‘ఉన్నది ఒకటే జిందగీ’తో కాస్త ఢీలా పడ్డ కిశోర్ తిరుమల చిత్రలహరితో ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. మరి వారిద్దరికి ఈ సినిమా ఏ మేరకు విజయాన్ని ఇస్తుందో చూడాలంటే ఏప్రిల్ 12వరకు ఆగాల్సిందే.