విజయసాయిరెడ్డి ఎంపికకు కారణమేంటి..?

పార్లమెంటరీ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించారు. అసలు విజయసాయిరెడ్డికి కీలక పదవి ఇవ్వడానికి కారణమేంటి..? టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా ఇంకా ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారు అయినప్పటికీ విజయసాయిరెడ్డినే ఎందుకు నియమించాల్సి వచ్చింది..? బీజేపీ చెప్పినట్లే వైసీపీ చేస్తోందా..? అసలు కథేంటి.. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్ 100 రోజుల పాలన ఎలా ఉన్నా… పార్లమెంటరీ […]

విజయసాయిరెడ్డి ఎంపికకు కారణమేంటి..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 14, 2019 | 3:35 PM

పార్లమెంటరీ స్థాయి సంఘాలను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమించారు. అసలు విజయసాయిరెడ్డికి కీలక పదవి ఇవ్వడానికి కారణమేంటి..? టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా ఇంకా ఎంతోమంది సీనియర్ నేతలు ఉన్నారు అయినప్పటికీ విజయసాయిరెడ్డినే ఎందుకు నియమించాల్సి వచ్చింది..? బీజేపీ చెప్పినట్లే వైసీపీ చేస్తోందా..? అసలు కథేంటి..

రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్ 100 రోజుల పాలన ఎలా ఉన్నా… పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను వెయ్యడం ద్వారా… శాఖల వారీగా మరింత జోరుగా పరిపాలన సాగించేందుకు కేంద్రం సిద్ధమైంది. అన్ని పార్టీల ఎంపీలనూ పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తూ… స్టాండింగ్ కమిటీల్లో వివిధ పార్టీల ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా చేర్చింది.

వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి కమిటీ సంఘం చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించగా.. కేశినేని నాని, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామాలను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చినట్లు ఓం బిర్లా తెలిపారు. ఇక పరిశ్రమల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును నియమించారు. ఈ కమిటీలో సభ్యుడిగా అవినాష్ రెడ్డిని నియమించారు. ఇక రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్‌గా టీజీ వెంకటేష్, పార్లమెంట్ వ్యవహారాల ఆర్థికశాఖ సభ్యులుగా మిథున్‌రెడ్డి, సీఎం రమేష్‌ను నియమిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.

అంతేకాదు గతంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా వైసీపీ సర్కార్ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతుతో ఏపీలో బీజేపీ హవా కొనసాగించే ప్రయత్నం చేయబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇక ఏపీలో కూడా బీజేపీ పాగా వేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

అయితే విజయసాయి రెడ్డి కంటే.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా సీనియర్ నేతలు ఉన్నారు. వారిని పక్కన పెట్టి విజయసాయిరెడ్డిని ఎంపిక చేయడం పై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడూ ప్రతిపక్షాలపై ట్వీట్లు మాత్రమే చేస్తూ ఉండే విజయసాయిరెడ్డి.. ఈ పదవికి సరైన న్యాయం చేస్తారా..? లేక బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటారా.? గతంలో కూడా బీజేపీ, వైసీపీ పార్టీల మధ్య స్నేహబంధం కుదిర్చేందుకు విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి ఈ పదవి అప్పగించారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..