రియల్ ఏస్టేట్ వ్యాపారి హత్య
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్పల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమీర్పేట్ సత్తయ్య( 40) దారుణ హత్యకు గురయ్యాడు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్పల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమీర్పేట్ సత్తయ్య( 40) దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సత్తయ్య గున్గల్ నుండి పెదతుళ్ళ వెళ్లే దారిలో శవమై కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని దర్యప్తు చేపట్టారు. టాటా సుమో వాహనంతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. సత్తయ్య కందుకూరు లో మిత్రులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. డబ్బుల విషయంలో భాగస్వాముల మధ్య విభేదాలు రావడంతో హత్యకు దారి తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కందుకూర్ కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.