కోహ్లీ, రోహిత్‌ భార్యల వివాదంపై.. భగ్గుమన్న రవిశాస్త్రి!

ముంబై: ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వట్టి పుకార్లేనని.. జట్టులో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని చెప్పారు. అంతేకాదు ఇన్‌స్టా వేదికగా ఆ క్రికెటర్ల భార్యల మధ్య వార్ జరుగుతోందని వస్తున్న వార్తలపై కూడా స్పందిస్తూ అవి రూమర్స్ అని కొట్టిపారేశారు. ఇక ఇదే ప్రశ్నను కోచ్ రవిశాస్త్రిని ఓ రిపోర్టర్ అడగ్గా.. ఆయన […]

కోహ్లీ, రోహిత్‌ భార్యల వివాదంపై.. భగ్గుమన్న రవిశాస్త్రి!
Follow us

|

Updated on: Jul 30, 2019 | 7:32 PM

ముంబై: ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ వస్తున్న వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ వట్టి పుకార్లేనని.. జట్టులో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని చెప్పారు. అంతేకాదు ఇన్‌స్టా వేదికగా ఆ క్రికెటర్ల భార్యల మధ్య వార్ జరుగుతోందని వస్తున్న వార్తలపై కూడా స్పందిస్తూ అవి రూమర్స్ అని కొట్టిపారేశారు.

ఇక ఇదే ప్రశ్నను కోచ్ రవిశాస్త్రిని ఓ రిపోర్టర్ అడగ్గా.. ఆయన మాట్లాడుతూ ‘త్వరలో క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నారని వార్తలు వస్తాయి. నన్ను ఏమి చేయమంటారు’ అని ఘాటుగా స్పందించారు. .

అటు కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ ‘ మీడియా మొత్తం అబద్దాలతో నిండి ఉంది. వాటినే మనం భూతద్దంలో చూస్తున్నాం. మంచి వార్తలను చూడకుండా.. ఇలాంటి వాటికీ స్పందిస్తూ.. మనకు మనమే ఫాంటసీస్ క్రియేట్ చేసుకుంటున్నాం’ అని అన్నాడు.

జట్టు అంతా సఖ్యతగానే ఉంది. టీమ్ కంటే ఎవరూ గొప్ప వ్యక్తి కాదని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక టీమిండియా ఆగష్టు 3 నుంచి విండీస్‌తో టీ20లు, వన్డే, టెస్ట్‌లు ఆడనుంది.