ఆ మృగాళ్లను నేను ఉరి తీస్తా..రాష్ట్రపతికి లేఖ
ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఆయన తిరస్కరిస్తే..వెంటనే ఉరిశిక్ష అమలు చెయ్యడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తిహార్ జైల్లో తలారి అందుబాటులో లేడు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడే అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిర్భయ కేసు దోషులకు ఉరి తీసేందుకు తాత్కాలిక తలారిగా తనను నియమించాలని కోరుతూ హిమాచల్ ప్రదేశ్కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ […]
ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఆయన తిరస్కరిస్తే..వెంటనే ఉరిశిక్ష అమలు చెయ్యడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తిహార్ జైల్లో తలారి అందుబాటులో లేడు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడే అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిర్భయ కేసు దోషులకు ఉరి తీసేందుకు తాత్కాలిక తలారిగా తనను నియమించాలని కోరుతూ హిమాచల్ ప్రదేశ్కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ కోవింద్కు లెటర్ రాశాడు.
ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఉరిశిక్షలు చాలా తక్కువగా విధిస్తారు. ఒకవేళ విధించినా రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పొందేవారు చాలామంది ఉంటారు. అందుకే తలారి విధులు నిర్వర్తించడానికి పర్మనెంట్గా ఎవరూ ఉండరు. అప్పుడెప్పుడో 2013లో పార్లమెంట్పై దాడులకు పాల్పడిన అప్జల్ గురును తిహార్ జైల్లో ఉరి తీశారు. ఆ తర్వాత ఇప్పుడ నిర్భయ కేసు దోషులను ఉరితీసే అవకాశాలు ఉన్నాయి. దీంతో తలారి అవసరం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్..నిర్భయను అత్యంత పాశవికంగా చంపిన దోషులకు ఉరి వేసే తలారీగా అవకాశం ఇవ్వమని కోరడం సంచలనంగా మారింది.