ఏఏ 20లో హీరోయిన్ గా రష్మిక ఫిక్స్..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం సుకుమార్ డైరెక్షన్ లో ఉండబోతున్నట్లు ప్రకటించాడు. కాగా ఈ చిత్రం త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రష్మిక ప్రస్తుతం యంగ్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త చిత్రం సుకుమార్ డైరెక్షన్ లో ఉండబోతున్నట్లు ప్రకటించాడు. కాగా ఈ చిత్రం త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
రష్మిక ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ తో ‘భీష్మ’, తమిళ హీరో కార్తీతో ఒక చిత్రంలో నటిస్తోంది. ఇవి కాకుండా మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటింపజేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
Sooo excited..!?? https://t.co/QHrDLpQkT2
— Rashmika Mandanna (@iamRashmika) April 8, 2019