డిజిటల్ వైపు అడుగులెస్తున్న మరో హీరోయిన్.. బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న బబ్లీ బ్యూటీ..
తెలుగులో 'ప్రతీరోజు పండగ' వంటి హిట్ సినిమా తర్వాత ఆశించినన్ని ఆఫర్లు దక్కించుకోలేకోపోయింది రాశిఖన్నా. ఆ సినిమా తర్వాత 'వరల్డ్ ఫేమస్
తెలుగులో ‘ప్రతీరోజు పండగ’ వంటి హిట్ సినిమా తర్వాత ఆశించినన్ని ఆఫర్లు దక్కించుకోలేకోపోయింది రాశిఖన్నా. ఆ సినిమా తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో నటించిన అంతగా హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇటు తెలుగులోనే కాకుండా.. అటు తమిళంలోనే కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇక త్వరలోనే డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నంది ఈ బబ్లీ బ్యూటీ. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి డిజిటల్ అరంగేట్రం చేయనుంది.
అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్ అండ్ డీకే పాపులర్ అయ్యారు. ఇక ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా రాజ్ అండ్ డీకే పాపులర్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత టెర్రరిస్టుగా కనిపించబోతుంది. ఇటీవలే సమంత ట్విట్టర్ ఎమోజీని కూడా సొంతం చేసుకుంది. ఇక ఇదే సిరీస్లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తుండగా… ఆ హీరో సరసన రాశిఖన్నా నటించనుందట. ఈ విషయాన్ని సోమవారం రాశిఖన్నా తన ట్విట్టర్లో షేర్ చేసింది. షాహీద్ కపూర్తో కలిసి సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి సైలెంట్ ఎమోజీని జతచేసింది. ఇక వెబ్ సిరీస్ గురించి పూర్తి విషయాలు త్వరలోనే వెలువడనున్నాయి.
? @shahidkapoor pic.twitter.com/3OPbHs4cMJ
— Raashi (@RaashiKhanna) January 25, 2021
Also Read: