బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్ఏఎఫ్ జవాన్‌పై దుండగుల కాల్పులు.. మృతి

బీహార్ : ముజప్ఫర్‌‌‌‌‌పూర్‌లో ఆర్ఏఎఫ్ జవాన్‌పై ఇద్దరు యువకులు కాల్పులు జరిపారు. ముజఫ్పర్‌పూర్ లోని కాజీ ముహమ్మద్ పూర్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్ సుధీర్ కుమార్ మాంఝీ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. అంతలో బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులను సుధీర్ కుమార్ అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బైక్ చోదకులు ఆర్ఏఎఫ్ జవాన్ సుధీర్ కుమార్ పై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్ సుధీర్ కుమార్ ను […]

బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్ఏఎఫ్ జవాన్‌పై దుండగుల కాల్పులు.. మృతి
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2019 | 10:10 AM

బీహార్ : ముజప్ఫర్‌‌‌‌‌పూర్‌లో ఆర్ఏఎఫ్ జవాన్‌పై ఇద్దరు యువకులు కాల్పులు జరిపారు. ముజఫ్పర్‌పూర్ లోని కాజీ ముహమ్మద్ పూర్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్ సుధీర్ కుమార్ మాంఝీ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. అంతలో బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులను సుధీర్ కుమార్ అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బైక్ చోదకులు ఆర్ఏఎఫ్ జవాన్ సుధీర్ కుమార్ పై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్ సుధీర్ కుమార్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి నిందితులపై చర్యలు తీసుకుంటామని ముజఫ్పర్‌పూర్ ఎస్పీ మనోజ్ చెప్పారు.