ముంబైలో అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు

దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు నమోదయింది. ఓ నటి చేసిన ఫిర్యాదుపై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అత్యాచారం, బలవంతపు ఒత్తిడి, మహిళ పట్ల అభ్యంతరకర..

ముంబైలో అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 23, 2020 | 3:09 PM

దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై రేప్ కేసు నమోదయింది. ఓ నటి చేసిన ఫిర్యాదుపై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అత్యాచారం, బలవంతపు ఒత్తిడి, మహిళ పట్ల అభ్యంతరకర ప్రవర్తన వంటి అభియోగాలపై ఈ కేసు నమోదైనట్టు ఆ నటి తరఫు లాయర్ నితిన్ సత్పుతే తెలిపారు. 2013 లో వెర్సోవాలోని ఓ ప్రాంతంలో తన క్లయింటుపై అనురాగ్ కశ్యప్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆయన అన్నారు. ఈ కేసు నమోదయింది గనుక అనురాగ్ కశ్యప్ ని పిలిపించి ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. కాగా-నటి పాయల్ ఘోష్ ఇటీవల  ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ పై ఇలాగే తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే  -తనపై పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అనురాగ్ కశ్యప్ ఖండిస్తూ ట్వీట్లు చేసిన విషయం గమనార్హం. ఆయనకు బాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు మద్దతు పలికారు.