మైనర్ బాలికపై అత్యాచారం.. కామాంధుడిని కుళ్ళబొడిచిన జనం!

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న 52 ఏళ్ల వ్యక్తిని ఆదివారం బాధితుడి బంధువు పొడిచి చంపాడు. ధార్వాడ్ లోని నావల్‌గుండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బసవేశ్వర్ నగర్ పట్టణానికి చెందిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నదాఫ్. శనివారం సాయంత్రం, బాధితురాలి తండ్రి, బంధువులు నదాఫ్ పై నావల్గండ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ముందు దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన నదాఫ్‌ను పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడు చికిత్స పొందుతుండగా, బాధితురాలి కజిన్(25 ఏళ్లు) ఆదివారం […]

మైనర్ బాలికపై అత్యాచారం.. కామాంధుడిని కుళ్ళబొడిచిన జనం!
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 5:47 PM

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న 52 ఏళ్ల వ్యక్తిని ఆదివారం బాధితుడి బంధువు పొడిచి చంపాడు. ధార్వాడ్ లోని నావల్‌గుండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బసవేశ్వర్ నగర్ పట్టణానికి చెందిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు నదాఫ్. శనివారం సాయంత్రం, బాధితురాలి తండ్రి, బంధువులు నదాఫ్ పై నావల్గండ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ముందు దాడిచేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన నదాఫ్‌ను పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

నిందితుడు చికిత్స పొందుతుండగా, బాధితురాలి కజిన్(25 ఏళ్లు) ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చి నిందితుడిని పొడిచి చంపాడు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఐపిసి సెక్షన్ 307, 353 కింద కేసు నమోదు చేశామని ధార్వాడ్ ఎస్పీ వర్తికా కాటియార్ తెలిపారు.

కత్తిపోటుకు గురైన తరువాత, నదాఫ్‌ను హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతను మరణించాడు. నిందితుడిని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం అతను కస్టడీలో ఉన్నాడు.