బాక్స్ ఆఫీస్ ‘రణరంగం’లో గెలిచేది ‘ఎవరు’.?
‘రణరంగం’.. హీరో శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న చిత్రం. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్లు హీరోయిన్లు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానున్న ఈ మూవీ యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 90వ దశకం స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న షేడ్స్లో కనిపించనున్నాడు. గడిచిన నాలుగైదేళ్లలో కామెడీతో కూడిన లవ్, ఫ్యామిలీ డ్రామాలు చేసిన శర్వానంద్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీతో వస్తున్నాడు. ప్రశాంత్ పిళ్లై సంగీతం అందిస్తున్న ఈ […]
‘రణరంగం’.. హీరో శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న చిత్రం. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్లు హీరోయిన్లు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానున్న ఈ మూవీ యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 90వ దశకం స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న షేడ్స్లో కనిపించనున్నాడు. గడిచిన నాలుగైదేళ్లలో కామెడీతో కూడిన లవ్, ఫ్యామిలీ డ్రామాలు చేసిన శర్వానంద్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీతో వస్తున్నాడు. ప్రశాంత్ పిళ్లై సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
ఇది ఇలా ఉండగా ఆగష్టు 15న మరో మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. అడివి శేష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘క్షణం’, ‘గూఢచారి’ సినిమాలతో సోలో హీరోగా అద్భుత విజయాలు అందుకున్న అడివి శేష్.. ఈ మూవీతో మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు. మరి ఈ ఇద్దరిలో బాక్స్ ఆఫీస్ కింగ్గా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.