రాహుల్ గాంధీ అలా అనలేదు, రణదీప్ సింగ్ సూర్జేవాలా
కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించలేదని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. అసలు సీనియర్లనెవరినీ ఆయన పల్లెత్తు మాట అనలేదని..
కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించలేదని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. అసలు సీనియర్లనెవరినీ ఆయన పల్లెత్తు మాట అనలేదని పేర్కొన్నారు. రాహుల్ కామెంట్స్ పై కపిల్ సిబల్ చేసిన ట్వీట్లపై ఆయన స్పందిస్తూ..తప్పుడు మీడియా వార్తలను, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసి, ప్రజలను, పార్టీని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అంతర్గతంగా ఒకరిపై ఒకరు పోరాడేబదులు నియంతృత్వ మోదీ పాలనపై అంతా ఒక్క తాటిపై పోరాడుదామని సూర్జేవాలా సూచించారు. అటు-రాహుల్ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ మొదట ధ్వజమెత్తారు. అయితే తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ తనకు వ్యక్తిగతంగా చెప్పారని తెలిపిన ఆయన.. తన మొదటి ట్వీట్ ను డిలీట్ చేశారు.
అటు-సస్పెండయిన కాంగ్రెస్ నేత సంజయ్ ఝా..రాహుల్ ని విమర్శిస్తూ..తాము బీజేపీతో కుమ్మక్కయి ఉంటే ..’బోరిస్ జాన్సన్’ మంచి ‘ క్రీమ్’ అవుతుందని సెటైర్ వేశారు.
Sh. Rahul Gandhi hasn’t said a word of this nature nor alluded to it.
Pl don’t be mislead by false media discourse or misinformation being spread.
But yes, we all need to work together in fighting the draconian Modi rule rather then fighting & hurting each other & the Congress. https://t.co/x6FvPpe7I1
— Randeep Singh Surjewala (@rssurjewala) August 24, 2020