మలయాళ హిట్ రీమేక్లో రానా..?
ఇటీవల కాలంలో మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రాల్లో 'ఏక్ అయ్యప్పన్ కుషియుమ్' చిత్రం ఒకటి. ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రాల్లో ‘ఏక్ అయ్యప్పన్ కుషియుమ్’ చిత్రం ఒకటి. ఈ మూవీని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ పాత్ర కోసం రానా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. అందులో పృథ్వీ రాజ్ చేసిన పాత్ర కోసం రానాను సంప్రదించగా.. అతడు ఓకే చెప్పినట్లు సమాచారం.
బిజు పాత్ర కోసం బాలయ్యను సంప్రదించినట్లు వార్తలు రాగా అందులో నిజం లేనట్లు టాక్. ఇక ఈ మూవీకి డైరక్టర్, మిగిలిన పాత్రాధారుల కోసం ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా నేపథ్యంలో ఇప్పుడు షూటింగ్లకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఆ బ్రేక్ ముగిసిన తరువాత ఈ రీమేక్కు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రానా నటించిన హాథీ మేరీ సాథీ(తెలుగులో అరణ్య) సినిమాను మామూలుగా వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడింది.
Read This Story Also: కరోనా లాక్డౌన్.. మరో బాధ్యత తీసుకున్న సుకుమార్.. ఏం చేస్తున్నారంటే..!