తమిళ రీమేక్లో రామ్..?
‘నేను శైలజ’ తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేని ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్కు రాగా మేలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తరువాత రామ్ ఓ తమిళ రీమేక్లో నటించనున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అరుణ్ విజయ్, తాన్యా హోప్ ప్రధానపాత్రలలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తాడమ్’ కోలీవుడ్లో మంచి విజయాన్ని సొంతం […]
‘నేను శైలజ’ తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేని ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ క్లైమాక్స్కు రాగా మేలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తరువాత రామ్ ఓ తమిళ రీమేక్లో నటించనున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అరుణ్ విజయ్, తాన్యా హోప్ ప్రధానపాత్రలలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తాడమ్’ కోలీవుడ్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ రైట్స్ను రామ్ పెద్దనాన్న, ప్రముఖ నిర్మాత స్రవంతి కిశోర్ కొనుగోలు చేశారట. ఈ మూవీని రామ్తో రీమేక్ చేయించాలనుకుంటున్న రవి కిశోర్, అందుకు తగ్గట్లుగా పనులకు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.