‘కమ్మ రాజ్యంలో’ మూవీ ఆ తండ్రీ కొడుకులకు అంకితం: వర్మ
చిన్నప్పటి నుంచి గిల్లడం అంటే తనకు ఇష్టమని.. అందుకే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీశానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపించలేదన్న వర్మ.. ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పుకొచ్చాడు. తనకు ఆసక్తిగా అనిపించిన అంశాన్నే సినిమాగా తీస్తానని.. ఈ సినిమా తీసినందుకు ఎవరి దగ్గరి నుంచి తనకు బెదిరింపులు రాలేదని వెల్లడించాడు. మామూలు క్రైమ్ కంటే పొలిటికల్ క్రైమ్ ఇంట్రెస్టింగ్గా ఉందని.. కమ్మ […]
చిన్నప్పటి నుంచి గిల్లడం అంటే తనకు ఇష్టమని.. అందుకే కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీశానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపించలేదన్న వర్మ.. ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పుకొచ్చాడు. తనకు ఆసక్తిగా అనిపించిన అంశాన్నే సినిమాగా తీస్తానని.. ఈ సినిమా తీసినందుకు ఎవరి దగ్గరి నుంచి తనకు బెదిరింపులు రాలేదని వెల్లడించాడు. మామూలు క్రైమ్ కంటే పొలిటికల్ క్రైమ్ ఇంట్రెస్టింగ్గా ఉందని.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని ఓ ప్రముఖ తండ్రీ కొడుకులకు అంకితం ఇస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక కేఏ పాల్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపే పనిలో ఉన్నారన్న వర్మ.. ఆయన ఇలాంటివి పట్టించుకోరని భావిస్తున్నానని సెటైర్లు వేశాడు.
కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రంపై హైకోర్టు ఏమందంటే..! కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంపై కేఏ పాల్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మూవీ ట్రైలర్లో తనను కించపరిచేలా చూపించారని కోర్టుకు తెలిపిన కేఏ పాల్..సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే చిత్రాన్ని విడుదల కాకుండా స్టే విధించాలని పాల్ కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా వ్యక్తి గతంగా టార్గెట్ చేసి కించపరిచేలా ఈ చిత్రాన్ని తీస్తున్నారని ఆధారాలను కూడా ఆయన కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఈ మూవీకి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాలేదని.. దీనిపై రివ్యూ నడుస్తుందని చిత్ర యూనిట్ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు గురువారం ఇవ్వాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.