కరోనా ఎఫెక్ట్: కొత్త అవతారంలో రకుల్.. గుర్తుపట్టారా..!
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటకు వస్తున్నప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు మాస్క్లు, గ్లౌజ్లు ధరిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త అవతారంలో దర్శనమిచ్చింది. ఇటీవల ముంబయి నుంచి ఢిల్లీకి వెళ్లిన రకుల్.. పీపీఈ కిట్ను ధరించింది. దీంతో మొదట ఆమెను గుర్తించడం కాస్త కష్టమైనప్పటికీ.. ఆ తరువాత గుర్తు పట్టిన అక్కడి ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో ఆమెను […]
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం, నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటకు వస్తున్నప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు మాస్క్లు, గ్లౌజ్లు ధరిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త అవతారంలో దర్శనమిచ్చింది. ఇటీవల ముంబయి నుంచి ఢిల్లీకి వెళ్లిన రకుల్.. పీపీఈ కిట్ను ధరించింది. దీంతో మొదట ఆమెను గుర్తించడం కాస్త కష్టమైనప్పటికీ.. ఆ తరువాత గుర్తు పట్టిన అక్కడి ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో ఆమెను క్లిక్మనిపించారు. ఇక ఎయిర్పోర్ట్లో రకుల్కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కాగా ప్రస్తుతం రకుల్ హిందీలో అటాక్, ఛలే ఛలో.. తమిళ్లో అయలాన్, ఇండియన్ 2, తెలుగులో నితిన్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని చిత్రాలు లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Read This Story Also: పాక్ నేతలని గజగజ వణికిస్తోన్న మహిళ.. ఇంతకు ఈమె ఎవరంటే..!