వేశ్య పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్?
టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్నా.. బాలీవుడ్ నుంచి మాత్రం పెద్దగా అవకాశాలేమీ రావడం లేదు ఈ అమ్మడుకి. ఇంతకు ముందు చేసిన సినిమాలు కూడా ఫ్లామ్ అవడంతో బాలీవుడ్ నుంచి అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ బాలీవుడ్పై దృష్టి సారించింది. సీనియర్ హీరోల సరసన సైతం నటించేందుకు...
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక అలాగే సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టీవ్గా ఉంటుంది రకుల్. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఉన్నా.. బాలీవుడ్ నుంచి మాత్రం పెద్దగా అవకాశాలేమీ రావడం లేదు ఈ అమ్మడుకి. ఇంతకు ముందు చేసిన సినిమాలు కూడా ఫ్లామ్ అవడంతో బాలీవుడ్ నుంచి అవకాశాలు తగ్గాయి. దీంతో రకుల్ బాలీవుడ్పై దృష్టి సారించింది. సీనియర్ హీరోల సరసన సైతం నటించేందుకు సై అంటోంది. అలాగే బోల్డ్ పాత్రల్లో కనిపించేందుకు కూడా సిద్ధపడుతోంది రకుల్.
తాజాగా ఓ వేశ్య పాత్రలో నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ ప్రముఖ వేశ్య బయోపిక్లో నటించనుందట. ఆ సినిమాలో ప్రధాన పాత్రలో రకుల్ నటించబోతుందంటూ పలు వార్తలు వస్తున్నాయి. బోల్డ్ రోల్ అయినా.. నటనకు ప్రాధాన్యం ఉండటంతో.. ఆ సినిమా చేసేందుకు ఒప్పుకుందట రకుల్. అయితే మరి ఈ వార్త నిజమో, కాదో తెలియాలంటే అధికారికంగా క్లారిటీ వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
Read More:
శుభవార్త.. కరోనా మందు మరింత తక్కువ ధరకే..