వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఆ నలుగురే ఫైనల్..!

ఈ నెల 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ లిస్ట్‌లో ముందుగా వార్తలు వచ్చినట్లుగానే పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైసీపీ సీనియర్ నేత అయోధ్య రామిరెడ్డి, రిలియన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ సత్వానీ ఉన్నారు.

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఆ నలుగురే ఫైనల్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 09, 2020 | 6:11 PM

ఈ నెల 26న జరగనున్న రాజ్యసభ ఎన్నికకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ లిస్ట్‌లో ముందుగా వార్తలు వచ్చినట్లుగానే పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైసీపీ సీనియర్ నేత అయోధ్య రామిరెడ్డి, రిలియన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ సత్వానీ ఉన్నారు. ఈ నలుగురి పేర్లను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వేంకటేశ్వరులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

కాగా ఏపీలో శాసన మండలి రద్దుకు తీర్మానం చేసిన వైసీపీ సర్కార్ దాన్ని కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మండలి రద్దు అయితే ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్, మోపిదేవి మంత్రి పదవులు వదులుకోవాల్సి ఉంటుంది. అందుకే వారికి రాజ్యసభ అవకాశం కల్పించారు జగన్. ఇక పార్టీలో ఎప్పటినుంచో ఉంటూ వస్తోన్నఅయోధ్య రామిరెడ్డికి ఈ సారి రాజ్యసభ అవకాశం కల్పించారు సీఎం. ఇక వీరితో పాటు రిలియన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ సత్వానీని వైసీపీ తరఫున మరోసారి పెద్దల సభకు పంపేందుకు జగన్ సిద్ధమయ్యారు.

Read This Story Also: వైసీపీ కండువా కప్పుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్..!