రాజ్యసభ నిరవధికంగా వాయిదా
రాజ్యసభ నిరవధికంగా వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరుగాల్సి ఉంది. కానీ, కోవిడ్ విస్తృతి నేపథ్యంలో సమావేశాల గడువును వారం రోజులు కుదిస్తున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి.
రాజ్యసభ నిరవధికంగా వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1 వరకు జరుగాల్సి ఉంది. కానీ, కోవిడ్ విస్తృతి నేపథ్యంలో సమావేశాల గడువును వారం రోజులు కుదిస్తున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి.
ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలు 18 రోజుల పాటు జరగాల్సి ఉన్నప్పటికీ 10 రోజులే జరిగాయని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ పది రోజుల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో 25 బిల్లులు ఆమోదం లభించగా.. ఆరు బిల్లులను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
ఈ సమావేశాల ఉత్పాదకత 100.47శాతంగా ఉందని అన్నారు. 198 మంది ఎంపీలు రాజ్యసభలో చర్చల్లో పాల్గొన్నారని, 1567 అన్స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు వెంకయ్య వెల్లడించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విపక్షాల గైర్హాజరీలోనే సభా కార్యకలాపాలు కొనసాగాయి. బుధవారం రాజ్యసభ ఆమోదించిన బిల్లుల్లో ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్-2020, ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్-2020, అండ్ ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ-2020 బిల్లులు, జమ్ముకశ్మీర్ అధికారిక భాషల బిల్లు-2020 ఉన్నాయి.అయితే అప్రాప్రియేషన్ (నెం.3) బిల్లు-2020, అప్రాప్రియేషన్ (నెం.4) బిల్లు-2020లను మాత్రం రాజ్యసభ తిప్పిపంపింది.
Watch: Rajya Sabha Chairman @MVenkaiahNaidu‘s Valedictory Remarks as 252nd Rajya Sabha Session concludes. The Upper House witnessed over 100% productivity. In the 10 sittings, 25 bills were passed.@VPSecretariat https://t.co/XRUfqRyf2C
— Rajya Sabha TV (@rajyasabhatv) September 23, 2020