రాజ్యసభలో పొగలు చిమ్మిన మైకులు.. పావుగంట వాయిదా
రాజ్యసభలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ ఆల్ఫోన్స్ ఉపయోగిస్తున్న మైక్ లో నుంచి ఆకస్మికంగా పొగలు రావడంతో ఆందోళనకు గురయ్యారు. బీజేపీ ఎంపీలు శివ ప్రతాప్ శుక్లా, పురుషోత్తమ్ రూపాలా మైకుల్లో నుంచి కూడా పొగలు రావడం గమనించారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. అంతకు ముందు సభ ప్రారంభమవ్వగానే.. మాజీ రాజ్యసభ సభ్యుడు, జైపాల్ రెడ్డి మృతి పట్ల […]
రాజ్యసభలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ ఆల్ఫోన్స్ ఉపయోగిస్తున్న మైక్ లో నుంచి ఆకస్మికంగా పొగలు రావడంతో ఆందోళనకు గురయ్యారు. బీజేపీ ఎంపీలు శివ ప్రతాప్ శుక్లా, పురుషోత్తమ్ రూపాలా మైకుల్లో నుంచి కూడా పొగలు రావడం గమనించారు. ఈ విషయాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. అంతకు ముందు సభ ప్రారంభమవ్వగానే.. మాజీ రాజ్యసభ సభ్యుడు, జైపాల్ రెడ్డి మృతి పట్ల సభ సంతాపం తెలిపింది. అనంతరం సభ ప్రారంభమైన కాసేపటికే.. ఈ ఘటన చోటుచేసుకుంది.
Rajya Sabha was adjourned earlier today for 15 minutes after smoke was detected in the House, from the mics of BJP MPs Shiv Pratap Shukla and Parshottam Rupala.
— ANI (@ANI) July 29, 2019