అమర జవాన్ల శవపేటికలు మోసిన కేంద్రమంత్రి
పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన వీరజవాన్ల శవపేటికలను స్వయంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వాహనాల్లో ఎక్కించారు. పుల్వామ ఘటన అనంతరం ఇవాళ ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి నుంచి బుద్గాం చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. వారి శవ పేటికలను వాహనాల్లోకి ఎక్కించేందుకు తన భుజాలపై మోస్తూ వాహనాల వద్దకు తీసుకెళ్లారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా […]
పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన వీరజవాన్ల శవపేటికలను స్వయంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ వాహనాల్లో ఎక్కించారు. పుల్వామ ఘటన అనంతరం ఇవాళ ఉదయం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. అనంతరం అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి నుంచి బుద్గాం చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. వారి శవ పేటికలను వాహనాల్లోకి ఎక్కించేందుకు తన భుజాలపై మోస్తూ వాహనాల వద్దకు తీసుకెళ్లారు. రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ కూడా శవపేటికలను వాహనాల్లోకి ఎక్కించారు.