మణి డ్రీమ్ ప్రాజెక్ట్కు రజనీ మూవీ బ్రేక్
లెజండరీ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్కు సూపర్స్టార్ రజనీకాంత్ సినిమా అడ్డంకిగా మారింది. అసలు మణి డ్రీమ్ ప్రాజెక్ట్ను ఇబ్బంది పెడుతున్న రజనీ సినిమా ఏంటి అనుకుంటున్నారా..? శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘2.O’ను చైనాలో విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. అయితే ‘ప్యాడ్మ్యాన్’ ఫలితంతో ఈ మూవీ రైట్స్ కొన్న హెచ్వై మీడియా వారు రిలీజ్ విషయంలో […]
లెజండరీ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్కు సూపర్స్టార్ రజనీకాంత్ సినిమా అడ్డంకిగా మారింది. అసలు మణి డ్రీమ్ ప్రాజెక్ట్ను ఇబ్బంది పెడుతున్న రజనీ సినిమా ఏంటి అనుకుంటున్నారా..?
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘2.O’ను చైనాలో విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. అయితే ‘ప్యాడ్మ్యాన్’ ఫలితంతో ఈ మూవీ రైట్స్ కొన్న హెచ్వై మీడియా వారు రిలీజ్ విషయంలో కాస్త జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారట. అందులోనూ వచ్చే నెల ‘ది లయన్ కింగ్’ విడుదల కానుండగా.. ఆ మూవీకి పోటీగా విడుదల చేస్తే నష్టపోయే అవకాశాలే ఎక్కువని భావిస్తున్నారట. అందుకే ఈ మూవీని ఇప్పట్లో విడుదల చేయకూడదని వారు అనుకుంటున్నారట.
ఇదిలాఉంటే మరోవైపు చైనాలో ఈ మూవీకి వచ్చే లాభాలను మణిరత్నం సినిమా ‘పొన్నియన్ సెల్వన్’కు వాడుకోవాలని ఆ సినిమాను నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ భావిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా పడటంతో మణి సినిమాకు ఇబ్బందులు పడుతున్నారు నిర్మాతలు. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ తదితరులు నటించనున్నారు.