మద్యం అమ్మకాలపై రజనీ ఫైర్.. తమిళనాడు సర్కార్కి వార్నింగ్..!
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులను ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు మద్యం అమ్మకాలు మొదలైన మొదటి రోజు నుంచి దుకాణాల వద్ద సామాజిక దూరం కూడా పాటించకుండా మందుబాబులు ఎగబడుతున్నారు. దీని ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పక్క రాష్ట్రం తమిళనాడులో మద్యం అమ్మకాలపై హైకోర్టు సీరియస్ అయింది. మద్యం అమ్మకాలు చేయొద్దంటూ తీర్పును ఇచ్చింది. దీనిపై ఆ రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించి, న్యాయ పోరాటం చేస్తోంది.
కాగా మద్యం అమ్మకాలపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యుల నుంచి సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వాలు చూడటం సరికాదని ఆయన అన్నారు. మద్యం అమ్మకాలను ఇలానే కొనసాగిస్తే అన్నాడీఎంకే మరోసారి అధికారంలోకి రాదన్న విషయం మర్చిపోవద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశారు.
Read This Story Also: జగదేక వీరుడు-అతిలోక సుందరి సీక్వెల్ దర్శకుడిగా రాజమౌళి..!