రాజస్థాన్ లో పెళ్లి ఊరేగింపుపై దూసుకొచ్చిన ట్రక్కు.. 13మంది మృతి

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని అంబవాలి గ్రామంలో ఓ పెళ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 34మంది గాయాలపాలయ్యారు. ఘటనాస్థలంలోనే 9మంది మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో 4గురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో పెళ్లి ఊరేగింపు కాస్తా విషాదంగా మారింది. క్షతగాత్రులను దగ్గర్లోని చోటిసద్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెనక నుంచి వచ్చిన ట్రక్ అదుపుతప్పి పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చినట్టు పోలీసులు […]

రాజస్థాన్ లో పెళ్లి ఊరేగింపుపై దూసుకొచ్చిన ట్రక్కు.. 13మంది మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:30 PM

రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలోని అంబవాలి గ్రామంలో ఓ పెళ్లి ఊరేగింపుపై ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. మరో 34మంది గాయాలపాలయ్యారు. ఘటనాస్థలంలోనే 9మంది మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో 4గురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో పెళ్లి ఊరేగింపు కాస్తా విషాదంగా మారింది. క్షతగాత్రులను దగ్గర్లోని చోటిసద్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెనక నుంచి వచ్చిన ట్రక్ అదుపుతప్పి పెళ్లి ఊరేగింపు పైకి దూసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.