రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అజయ్ మాకెన్, సచిన్ పైలట్ హర్షం
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి, ఇన్-ఛార్జ్ గా సీనియర్ నేత అజయ్ మాకెన్ నియమితులయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్ కి సన్నిహితుడైన అవినాష్ పాండేని జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించాలన్న సచిన్...
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి, ఇన్-ఛార్జ్ గా సీనియర్ నేత అజయ్ మాకెన్ నియమితులయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్ కి సన్నిహితుడైన అవినాష్ పాండేని జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించాలన్న సచిన్ డిమాండును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించారు. పాండే స్థానే మాకెన్ ని నియమించారు. ఇక కొత్త జనరల్ సెక్రటరీగా మాకెన్ వ్యవహరించనున్నారు. ఈ నియామకం పట్ల సచిన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మీ నియామకం రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తల ఆశలను మరింత పెంచుతాయని అన్నారు. సోనియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అశోక్ గెహ్లాట్ అనుకూలుడైన అవినాష్ పాండేని మొదటినుంచి సచిన్ పైలట్ వ్యతిరేకిస్తున్నారు. తనకు, గెహ్లాట్ కు మధ్య విభేదాలు పెరగడానికి పాండేయే బాధ్యుడని ఆయన నమ్ముతున్నారు. అందువల్ల ఆయనను తొలగించాలని పైలట్ సోనియా వద్ద తన ప్రధాన డిమాండును లేవనెత్తారు. ఇందుకు ఆమె కూడా అంగీకరించడం విశేషం.