మద్యం ప్రియులకు భారీ షాక్.. లాక్డౌన్ ఎత్తేశాక ధరలు చూస్తే..!
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుంది. ధరలు ఆకాశాన్నంటనున్నాయి. ఇప్పటికే లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి మద్యం విక్రయాలపై ఎక్సైజ్ డ్యూటీని మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఇండియా మేడ్ ఫారిన్ మద్యంతోపాటు బీరుపై 35 శాతం, ఇతర లిక్కర్ విక్రయాలపై 45 శాతం ఎక్సైజ్ […]
లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మద్యం ప్రియులకు భారీ షాక్ తగలనుంది. ధరలు ఆకాశాన్నంటనున్నాయి. ఇప్పటికే లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం భారీగా తగ్గింది. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇక నుంచి మద్యం విక్రయాలపై ఎక్సైజ్ డ్యూటీని మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఇండియా మేడ్ ఫారిన్ మద్యంతోపాటు బీరుపై 35 శాతం, ఇతర లిక్కర్ విక్రయాలపై 45 శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. ఎక్పైజ్ డ్యూటీ పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని రాజస్థాన్ సర్కార్ పేర్కొంది. రాష్ట్రానికి సంబంధించిన ఎక్సైజ్ యాక్ట్ 1950 సెక్షన్ 28 ప్రకారం.. మద్యం ధరలపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రాల ఆదాయాలు భారీగా పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.