రామాలయ నిర్మాణంలో ‘పింక్ స్టోన్’ వాడకంపై నిషేధం
అయోధ్యలో జరిగే రామాలయ నిర్మాణంలో పింక్ స్టోన్ (లేత గులాబీ రంగు రాళ్ల) వినియోగాన్ని రాజస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్ర గనుల శాఖ, భరత్ పూర్ జిల్లా అధికారులు, పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
అయోధ్యలో జరిగే రామాలయ నిర్మాణంలో పింక్ స్టోన్ (లేత గులాబీ రంగు రాళ్ల) వినియోగాన్ని రాజస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్ర గనుల శాఖ, భరత్ పూర్ జిల్లా అధికారులు, పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ నిర్మాణం పేరు చెప్పి కొంతమంది ఈ పింక్ స్టోన్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతుండడాన్ని అధికారులు గుర్తించారు. బన్షీపహర్ పూర్ లో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, అసలు ఈ తవ్వకాలకు సంబంధించి ఎవరికీ లీజుకు ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పింక్ స్టోన్స్ తో నింపిన సుమారు పాతిక ట్రక్కులను అధికారులు పట్టుకున్నప్పుడు ఈ ‘బాగోతం’ బయటపడింది. నిజానికి ఆలయ నిర్మాణాల్లో పింక్ స్టోన్ వాడడం పరిపాటి. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వీటిని వినియోగిస్తామని ప్రచారం చేసి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు.