‘బ్రహ్మాస్త్ర’ తెలుగు లోగోను రిలీజ్ చేసిన జక్కన్న

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్‌ రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన తెలుగు లోగోను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ‘అద్భుతమైన నటీనటులతో, మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు లోగోను విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది’ అని జక్కన్న ట్వీట్‌ చేశారు. ఇటీవల మహాశివరాత్రిని పురస్కరించుకుని […]

‘బ్రహ్మాస్త్ర’ తెలుగు లోగోను రిలీజ్ చేసిన జక్కన్న
Follow us

|

Updated on: Mar 11, 2019 | 12:31 PM

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్‌ రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన తెలుగు లోగోను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ‘అద్భుతమైన నటీనటులతో, మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు లోగోను విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది’ అని జక్కన్న ట్వీట్‌ చేశారు. ఇటీవల మహాశివరాత్రిని పురస్కరించుకుని చిత్రబృందం వినూత్నంగా కుంభమేళా కార్యక్రమంలో దాదాపు 150 డ్రోన్లతో లోగోను ఆవిష్కరించింది. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ కనీవిని ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం అంటోంది. మొదటి భాగం క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.