యంగ్ టైగర్ మిస్సవుతున్నదేంటి… ?

ట్రిపులార్ మూవీ కీలక షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శివార్లలోని లొకేషన్లో క్రూషియల్ సీన్ సీక్వెన్సెస్ తీస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే కొన్ని సినిమాలు కోవిడ్ బారిన పడి సతమతం అవుతుంటే..

యంగ్ టైగర్ మిస్సవుతున్నదేంటి... ?
Follow us

|

Updated on: Nov 07, 2020 | 12:04 AM

Komaram Bheem : ట్రిపులార్ మూవీ కీలక షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శివార్లలోని లొకేషన్లో క్రూషియల్ సీన్ సీక్వెన్సెస్ తీస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే కొన్ని సినిమాలు కోవిడ్ బారిన పడి సతమతం అవుతుంటే.. తమ యూనిట్ ని చాలా కేర్ ఫుల్ గా లీడ్ చేస్తున్నారు జక్కన్న. కనీసం భోజనం కూడా క్యాటరింగ్ ఇవ్వకుండా ఇంటినుంచి స్వయంపాకం తెచ్చుకోమని ఆర్డరేశారు. ఇండివిడ్యువల్ గా కూడా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళున్నారు.

భీం రోల్ చేస్తున్న ఎన్టీయార్.. చాలా కఠిన నియమాలు పెట్టుకునిమరీ షూట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సెట్ వదిలితే హోటల్ రూమ్.. అక్కడ బయలుదేరితే మళ్ళీ షూటింగ్ స్పాట్..! ఇంతే తప్ప.. ఇంటి ధ్యాసే వదిలేశారు తారక్. షెడ్యూల్ మొదలైన దగ్గరనుంచీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఇంటికెళ్ళలేదట. జస్ట్ గంట లోపు జర్నీ చేస్తే ఇల్లు చేరుకోవచ్చు. అయినా తారక్ అజ్ఞాతవాసంలోనే ఉన్నారట.

ఇంట్లో ఇద్దరు పిల్లలు.. వయసు ఎక్కువ వున్న తల్లి..! అందుకే.. ఫిజికల్ డిస్టెన్స్ అనే గైడ్ లైన్ ని కంపల్సరీగా పాటిస్తున్నారు ఎన్టీయార్. మన వల్ల మరొకరికి రిస్క్ రాకూడదన్న కమిట్మెంట్ ఆయన్ను అలా కట్టిపడేసింది. గతంలో రాత్రికల్లా లొకేషన్ నుంచి ఇంటికొచ్చి వాలిపోయి.. పిల్లలతో స్పెండ్ చేయడం ఎన్టీయార్ అలవాటు. ఇప్పుడు కరోనా భూతమొచ్చి తన ఫామిలీ ఆబ్సెషన్ ని కంట్రోల్ చేస్తోందట. వీడియో కాల్స్ తో తల్లీ, భార్య, పిల్లలతో మాట్లాడుతూ స్పెండ్ చేస్తున్నారు అభినవ కొమరం భీముడు.