రైతన్నలకు గుడ్ న్యూస్… పట్టాలెక్కుతున్న తొలి ‘కిసాన్‌ రైలు’

భారత రైల్వే మరో మైలు రాయిని అధిగమించబోతోంది. మరో చరిత్ర రాయబోతోంది. రైతుల కోసం ప్రవేశపెడుతున్న తొలి ‘కిసాన్‌ రైలు’ పట్టాలు ఎక్కబోతోంది. ఈ కిసాన్ రైలుకు శుక్రవారం (ఆగస్టు06) కేంద్రం పచ్చ జండా ఊపబోతోంది. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్‌లోని దానపూర్‌ వరకు నడిచే తొలి కిసాన్‌ రైలుకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైలు వారంలో ఒకసారి […]

రైతన్నలకు గుడ్ న్యూస్... పట్టాలెక్కుతున్న తొలి ‘కిసాన్‌ రైలు’
Follow us

|

Updated on: Aug 06, 2020 | 8:54 PM

భారత రైల్వే మరో మైలు రాయిని అధిగమించబోతోంది. మరో చరిత్ర రాయబోతోంది. రైతుల కోసం ప్రవేశపెడుతున్న తొలి ‘కిసాన్‌ రైలు’ పట్టాలు ఎక్కబోతోంది. ఈ కిసాన్ రైలుకు శుక్రవారం (ఆగస్టు06) కేంద్రం పచ్చ జండా ఊపబోతోంది. మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి బీహార్‌లోని దానపూర్‌ వరకు నడిచే తొలి కిసాన్‌ రైలుకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పచ్చజెండా ఊపనున్నారు.

ఈ రైలు వారంలో ఒకసారి మాత్రమే నడుస్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు దేవ్లాలిలో బయలుదేరి శనివారం సాయంత్రం 6.45కి దానాపూర్‌ చేరుతుంది. 1,519 కిలోమీటర్ల దూరాన్ని 32 గంటల్లో పూర్తి చేస్తుంది. త్వరగా పాడైపోయే పాలు, మాంసం, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులను వేగవంతంగా రవాణా చేసేందుకు కిసాన్‌ రైళ్లను రైల్వే శాఖ వినియోగించనుంది. బీహార్‌లో పాడి అధికంగా ఉండటంతో ప్రయోగాత్మకంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మంచి ఫలితాలను ఇస్తే ప్యూచర్ లో మరిన్న రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.