శభాష్ ఇండియన్ రైల్వే.. ప్రపంచ రికార్డ్ కొట్టేశారుగా..
ఇండియన్ రైల్వే గురువారం నాడు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. డబుల్ డెక్కర్ ట్రైన్స్ ప్రయాణికులను తీసుకెళ్లేవి దాదాపు అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కనిపిస్తుంటాయి.
ఇండియన్ రైల్వే గురువారం నాడు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. డబుల్ డెక్కర్ ట్రైన్స్ ప్రయాణికులను తీసుకెళ్లేవి దాదాపు అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కనిపిస్తుంటాయి. కానీ గూడ్స్ సప్లే చేసే.. ట్రైన్లు మాత్రం అలాంటివి ఇప్పటి వరకు లేవు. అయితే గూడ్స్ సప్లై చేసే ట్రైన్లలో కూడా డబుల్ డెక్కర్ ట్రైన్లను తయారు చేసి.. పట్టాలపై పరుగులు పెట్టించింది ఇండియన్ రైల్వే. ఈ రికార్డును గురువారం నాడు గుజరాత్లో నమోదు చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ట్రాక్పై పరుగులు పెట్టిన అతి పెద్ద ట్రైన్ ఇదేనని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘనత సాధించింది ప్రపంచంలో మన ఇండియన్ రైల్వేనేనంటూ ఆ శాఖ అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో కూడా.. గూడ్స్ సప్లై ద్వారా పెద్ద ఎత్తున ఆదాయాన్ని పెంచుకునేలా లక్ష్యాన్ని పెట్టుకుంది. గతేడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ సరుకు రవాణా చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ఆ శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు.