గజ్వేల్, మెదక్కు 2 నెలల్లో రైలు: హరీశ్రావు
మెదక్: సీఎం కేసీఆర్ కృషి వల్లే మెదక్, సిద్దిపేట జిల్లాలుగా ఏర్పడ్డాయని ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్, మెదక్కు రెండు నెలల్లో రైలు రాబోతుందని చెప్పారు. మెదక్ జిల్లా అంటేనే మెతుకుసీమ.. అందరికీ అన్నం పెట్టిన జిల్లా అని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కేసీఆర్ కృషి వల్లే గణపురం చెరువులోకి నీళ్లు వచ్చాయని తెలిపారు. వచ్చే జూన్, జులై నాటికి కాళేశ్వరం నీళ్లు […]
మెదక్: సీఎం కేసీఆర్ కృషి వల్లే మెదక్, సిద్దిపేట జిల్లాలుగా ఏర్పడ్డాయని ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గజ్వేల్, మెదక్కు రెండు నెలల్లో రైలు రాబోతుందని చెప్పారు. మెదక్ జిల్లా అంటేనే మెతుకుసీమ.. అందరికీ అన్నం పెట్టిన జిల్లా అని పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కేసీఆర్ కృషి వల్లే గణపురం చెరువులోకి నీళ్లు వచ్చాయని తెలిపారు. వచ్చే జూన్, జులై నాటికి కాళేశ్వరం నీళ్లు మెదక్ జిల్లాకు రాబోతున్నాయని ప్రకటించారు. కేసీఆర్కు కృతజ్ఞత చెప్పాలంటే మెదక్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గులాబీ జెండా ఎగరేసి ఢిల్లీలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.