అమెరికాలో కర్ణాటకకు చెందిన యువ డాక్టర్ అనుమానాస్పద మృతి

అమెరికా : న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో డాక్టర్‌గా పనిచేతస్తున్న నందిగం మణిదీప్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన మణిదీప్.. క‌ర్నాట‌క క‌స్తూర్బా మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. మూడేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోసం అత‌ను న్యూజెర్సీ వెళ్లాడు. అక్క‌డ సెయింట్ పీట‌ర్స్ యూనివ‌ర్సిటీ హాస్ప‌ట‌ల్‌లో ప‌నిచేస్తున్నాడు. అయితే శనివారం అనుమానాస్పద స్థితిలో మణిదీప్ మృతిచెందాడు. మ‌ణిదీప్ మృతి గురించి అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. ఏ కార‌ణం చేత అత‌ను […]

అమెరికాలో కర్ణాటకకు చెందిన యువ డాక్టర్ అనుమానాస్పద మృతి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 30, 2019 | 5:13 PM

అమెరికా : న్యూజెర్సీలోని సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో డాక్టర్‌గా పనిచేతస్తున్న నందిగం మణిదీప్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందిన మణిదీప్.. క‌ర్నాట‌క క‌స్తూర్బా మెడిక‌ల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. మూడేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోసం అత‌ను న్యూజెర్సీ వెళ్లాడు. అక్క‌డ సెయింట్ పీట‌ర్స్ యూనివ‌ర్సిటీ హాస్ప‌ట‌ల్‌లో ప‌నిచేస్తున్నాడు. అయితే శనివారం అనుమానాస్పద స్థితిలో మణిదీప్ మృతిచెందాడు. మ‌ణిదీప్ మృతి గురించి అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జేశారు. ఏ కార‌ణం చేత అత‌ను మృతిచెందాడో ఇంకా తెలియ‌రాలేదు. త‌మ కుమారుడి మృతి ప‌ట్ల విచార‌ణ చేప‌ట్టాల‌ని మ‌ణిదీప్ పేరెంట్స్ డిమాండ్ చేశారు.మ‌ణిదీప్ భౌతిక‌దేహాన్ని భార‌త్‌కు పంపించేందుకు ఎంబ‌సీతో తానా ట‌చ్‌లో ఉన్న‌ట్లు ఒక‌రు తెలిపారు.