రాహుల్ తెలంగాణ పర్యటన: సభా వేదిక మార్పు
హైదరాబాద్: ఈ నెల 9న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా చేపట్టబోయే భారీ బహిరంగ సభా ప్రాంగణం మారింది. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం సెగ్మెంట్ పహాడీషరీఫ్లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు మంగళవారం నిర్ణయించినప్పటికీ.. అక్కడ సభ నిర్వహించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో సభా ప్రాంగణాన్ని శంషాబాద్కు మార్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ తొలిసారిగా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఈ సభను భారీగా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.
హైదరాబాద్: ఈ నెల 9న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా చేపట్టబోయే భారీ బహిరంగ సభా ప్రాంగణం మారింది. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం సెగ్మెంట్ పహాడీషరీఫ్లో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు మంగళవారం నిర్ణయించినప్పటికీ.. అక్కడ సభ నిర్వహించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో సభా ప్రాంగణాన్ని శంషాబాద్కు మార్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ తొలిసారిగా రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఈ సభను భారీగా నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.