రైతు చట్టాలకు నిరసన, పంజాబ్ సందర్శించనున్న రాహుల్ గాంధీ
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆదివారం పంజాబ్ లో జరగనున్న నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరి కొద్దిసేపట్లో ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఖేతీ బచావో యాత్ర..
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆదివారం పంజాబ్ లో జరగనున్న నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరి కొద్దిసేపట్లో ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఖేతీ బచావో యాత్ర పేరిట జరిగే బహిరంగ సభలు, సంతకాల సేకరణ వంటి ఉద్యమాల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు లూధియానాలో జరగనున్న ట్రాక్టర్ ర్యాలీలో కూడా రాహుల్ పార్టిసిపేట్ చేస్తారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖర్ .ఇతర నేతలు కూడా ఈ ఆందోళనా కారక్రమాల్లో పాల్గొంటారు. మూడు రోజులపాటు ఈ నిరసనలు కొనసాగనున్నాయి.