రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి. ఈ మాట అన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతలు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్గా నిల్చారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోదరుడు, లక్ష్మణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 10రోజుల్లోనే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైనందున రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో.. తెలియజేయాలన్నారు. గతేడాది జూన్లో జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంలో భాగంగా.. మందసర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అప్పుడ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పలు కీలక ప్రకటనలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక.. ఆ ప్రకటనలకు సంబంధించిన ముందడుగు మాత్రం వేయలేదు. తనతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రైతుల్ని కలుస్తున్నామనీ.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ధ్రువీకరణ పత్రాలు జారీచేసినా సంబంధిత బ్యాంకు మేనేజర్లు మాత్రం రుణం మాఫీ కాలేదని చెబుతున్నారంటూ వాపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాలంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని చచోడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే లక్ష్మణ్ సింగ్ ఇలా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. మొన్న కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్ధుతు పలికారు.
Breaking News
- ఏడు నెలల పాలనలో జగన్ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
- ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
- కృష్ణాజిల్లా: కీసర టోల్ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్ కౌంటర్ల ద్వారా టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది.
- చిత్తూరు టూటౌన్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్స్టేషన్ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
- చెన్నై వన్డేలో టాస్గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్. భారత్-విండీస్ మధ్య తొలివన్డే.
- తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
- విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.
రాహుల్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్
- Posted September 20, 2019
- 5:21 am
- IST
