అరటి పండ్ల ధర చూసి బిత్తరపోయిన హీరో..
బాలీవుడ్ హీరో రాహుల్ బోస్ కు ఓ వింత అనుభవం ఎదురైంది. చండీగడ్లో ఓ షూటింగ్ నిమిత్తం ఓ ఫైవ్స్టార్ హోటల్లోకి వెళ్లాడు. జిమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత రెండు అరటి పండ్లను ఆర్డర్ చేశాడు. వాటికి రూ.442.50 బిల్లు వేయడంతో రాహుల్ షాకయ్యాడు. సెంట్రల్ జీఎస్టీ రూ.33.75, యూటీ జీఎస్టీ రూ.33.75 జీఎస్టీతో కలిపి అంత బిల్లు వేశారు. దీంతో రాహుల్.. పండ్లు ఆరోగ్యానికి హానికరం కాదని ఎవరు చెప్పారంటూ సోషల్ మీడియా ద్వారా […]
బాలీవుడ్ హీరో రాహుల్ బోస్ కు ఓ వింత అనుభవం ఎదురైంది. చండీగడ్లో ఓ షూటింగ్ నిమిత్తం ఓ ఫైవ్స్టార్ హోటల్లోకి వెళ్లాడు. జిమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత రెండు అరటి పండ్లను ఆర్డర్ చేశాడు. వాటికి రూ.442.50 బిల్లు వేయడంతో రాహుల్ షాకయ్యాడు. సెంట్రల్ జీఎస్టీ రూ.33.75, యూటీ జీఎస్టీ రూ.33.75 జీఎస్టీతో కలిపి అంత బిల్లు వేశారు. దీంతో రాహుల్.. పండ్లు ఆరోగ్యానికి హానికరం కాదని ఎవరు చెప్పారంటూ సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని షేర్ చేశాడు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అరటి పండ్ల ధరను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే.. ఆ ధరతో ఏకంగా అరటి పండ్ల గెల కొనేయచ్చని అంటున్నారు. ఇంకొందరు బయట మార్కెట్లో ఆ జీఎస్టీ ధరలకు డజను అరటి పండ్లు దొరుకుతాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు బహుశా భూమి మీద పండే ఆఖరి పండ్లు అవే కావచ్చేమో అంటూ జోకులు పేలుస్తున్నారు.
You have to see this to believe it. Who said fruit wasn’t harmful to your existence? Ask the wonderful folks at @JWMarriottChd #goingbananas #howtogetfitandgobroke #potassiumforkings pic.twitter.com/SNJvecHvZB
— Rahul Bose (@RahulBose1) July 22, 2019