‘చైనా దళాలను ఎప్పుడు వెళ్ళగొడతారో చెప్పండి’ ! మోదీకి రాహుల్ ప్రశ్న
మన దేశ భూభాగం నుంచి చైనా దళాలను ఎప్పుడు తరిమేస్తారో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..ప్రధాని మోదీని ప్రశ్నించారు. లడాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరుగుతోందన్నారు. చైనా ఆక్రమణ గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. మోడీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి కేవలం కొద్దిసేపటి ముందు రాహుల్ ఈ ప్రశ్న వేశారు. అయితే మోదీ తన ప్రసంగంలో..దేశంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి ప్రస్తావించారు. ఈ వైరస్ బెడద ఇంకా అంతం కాలేదని, మనం ఇంకా […]
మన దేశ భూభాగం నుంచి చైనా దళాలను ఎప్పుడు తరిమేస్తారో చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..ప్రధాని మోదీని ప్రశ్నించారు. లడాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరుగుతోందన్నారు. చైనా ఆక్రమణ గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. మోడీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి కేవలం కొద్దిసేపటి ముందు రాహుల్ ఈ ప్రశ్న వేశారు. అయితే మోదీ తన ప్రసంగంలో..దేశంలో కరోనా వైరస్ పరిస్థితి గురించి ప్రస్తావించారు. ఈ వైరస్ బెడద ఇంకా అంతం కాలేదని, మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.